కార్పొరేట్ ఆసుపత్రిలో పని చేసే వైద్యులు ఏడాదిలో ఒక్కసారైనా మీకు నచ్చిన ఆసుపత్రిలో నచ్చిన జీతానికి కనీసం నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిల్లో తమ సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో నిరుపేద ప్రజలకు సేవలందించడం ద్వారా ఒక సామాజిక బాధ్యతగా వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లబిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ అసుపత్రుల వైద్య సేవలు మెరుగు పరచాలనె సంకల్పం తో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు.
AIG ఆసుపత్రి ప్రారంభోత్సవం
హైదరాబాద్ బంజారహిల్స్ లో ఏఐజి(AIG) నూతన అసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, కార్పొరేట్ రంగంలో ఉన్న వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించాలంటే సరైన వ్యవస్థ లేదని, ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించినట్లు చెప్పారు.
ఆరోగ్య రంగం అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టగానే పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 2 లక్షలుగా ఉన్న దాన్ని 10 లక్షలకు పెంచాం. దినితో పాటుగా CMRF ( CM RELIFE FUND) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 14 వందల కోట్లు ఖర్చు చేశాం. ప్రతి నిరుపేద ప్రజలకు వీలైనంత వరకు ఉచిత విద్య,వైద్యం అందించాలన్న ఆలోచనతో ఆయా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. బడ్జెట్ లో వైద్య రంగానికి 11,500 కోట్లు , విద్య రంగానికి 21 వేల కోట్లు కేటాయించాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
వైద్య రంగలో అభవృద్ధి
నిమ్స్ ఆసుపత్రిలో మరో 2 వేల పడకల విభాగంప్రారంభించబోతున్నాం. ఇప్పుడు వచ్చే డిసెంబర్ నాటికళ్ళ వరంగల్,ఆల్వాల్,ఎల్బీనగర్,సనత్ నగర్ తదితర ప్రాంతం లో కార్పొరేట్ అసూపత్రులకు దీటుగా రాష్ట్రంలో 7 వేల పడకల అశుపాత్రులను అందుబాటులోకి తేవాలని నిర్ధేశించాం. అమెరికాలో స్థిరపడిన మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలు అందించాలకంటే సరైన ప్లాట్ ఫామ్ ఏది లేదు. అలాంటి డాక్టర్లు మన రాష్ట్రానికి వస్తే వారికి అనుగుణంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించాం.
ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర
ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయలు ఉండవని, సరైన సేవలు అందించారని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలు పోతాయనే అపోహ ఉంది. ఇలాంటి అభిప్రాయాలను దూరం చేయాలనే సంకల్పంతో కార్పొరేట్ అసుపత్రులకు ధిటుగా ప్రభుత్వ రంగంలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా అసూపత్రికి 30 ఎకరాల స్థలం కేటాయించి 3 వేల కోట్లతో కొత్త ఆసుపత్రి నిర్మిస్తున్నాం. ఇది భారత దేశ పూర్తన అసూపత్రిగా పేరుగాంచింది. కొత్త ఆసుపత్రి గోశామల్ స్టేడియం దగ్గర 30 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. రాబోయే 50 సంవత్సరాలను దుష్టిలో ఉంచుకొని ఈ ఆసుపత్రి నిర్మిస్తునారు. ఈ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలతో అవయవ మార్పిడి అత్యవసరాలలో రోగుల తరలింపు వాటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడుతుంది. ఈ ఆసుపత్రిలో రోగులకు సందర్శకులకు ఆసుపత్రి సిబ్బందికి వాహనాలు నిలుపుకోవడానికి అండర్ గ్రౌండ్ పార్కింగ్ చేపడతారు. ఈ కొత్త ఆసుపత్రి నిర్మాణం ద్వారా ఎంతో మంది రోగులకు మెరుగైన చికిత్స అందుతుంది.
రాష్ట్రం లో ఎక్కువగా మహిళలు కాన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో కోటి మంది సభ్యులను చేర్పించడమే కాకుండా వారికి హెల్త్ కార్డ్ ప్రొఫైల్ తయారు చేయాలన్నది మా లక్ష్యం. అందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తో ఒక యూనిక్ ఐడి నంబర్ తో కార్డులను జారీ చేయాలి అని నిర్ణయించారు.
ఏఐజి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
2047 తెలంగాణ రైజింగ్
2047 విజన్ డాక్యుమెంట్ తో రాబోయే వంద సంవత్సరాలు లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ ఆరోగ్య రంగంలో ఒక చాప్టర్ గా నిలిచిపోతుంది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో 2047 నాటికి మన రాష్ట్రాన్ని బలమైన ఆర్ధిక వ్యవసస్థగా మార్చదానికి రూపొందించినదే తెలంగాణ రైజింగ్. 2035 నాటికి న రాష్ట్ర $1 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థను చెరకోవడం , 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థగా రూపొంచినడమే ఈ తెలంగాణ రైజింగ్ లక్ష్యం. దేశ ఆర్ధిక జిడిపి లో మనం 10% కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణగా గ్రామల అభివృద్ధి,మౌలిక సదుపాయాలు అందించడం. పట్టణాల అభివృద్ధి హైదరాబాద్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం. యువతకు నైపుణ్య అభివృద్ధి ఉపాధి అవకాశాలు కల్పించడం. మెరుగైన వైద్య , విద్య వంటి రంగాలలో నూతన అవకాశాలు కల్పించడం.
అందుకోసం డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కాన్సర్ చికిత్స కి సంబందించిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని ప్రభుత్వ సలహదారుగా నియమించింది.
హైదరాబాద్ గొప్ప దానం
మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేషమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మిస్ వరల్డ్ పోటీలో రెండవ స్థానంలో గెలిచిన వారు ఏఐజి ఆసుపత్రి గురించి మాట్లాడడం ద్వారా హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచింది. ఏఐజి ఆసుపత్రిలో అధినిక వైద్య సదుపాయాలను చూపించ్చడం ద్వారా టోక్యో,సౌత్ కొరియా, న్యూయార్క్ వంటి నాగరాలతో హైదరాబాద్ పోటీ పడగలదని నిరూపించాం అన్నారు. హైదరాబాద్ నుండి మిడిల్ ఈస్ట్ దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్ అనెక్టివిటీ లేకపోవడం వల్ల వైద్య సేవలు ఇబ్బందులు పడుతునరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయం గురించి పౌర విమానయన శాఖ మంత్రితో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వైద్య సహాయం కోసం ఏటా 2.2 లక్షల మంది రొగులు వస్తున్నారని సీఐఐ గణాంకాలు వెల్లడించయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కొనెక్టివిటీ ని పెంచడం ద్వారా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సిఎం తెలిపారు.
హైదరాబాద్ నగర ప్రజలకు రెండో అతి పెద్ద అసూపత్రిగా అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 దేశాల నుంచి చికిత్స కోసం ఏఐజి ఆసుపత్రికి రావడం అది రాష్ట్రానికి గర్వకారణం. ఈ ఆసుపత్రి రూపొందించిన జననీ మిత్ర యాప్ సంబందించి అధికారులను పంపించి అధ్యయనం చేయమని ఆదేశిస్తాం .
జపాన్ తో అనుబందం
జపాన్ లో వృద్ద జనాభా ఎక్కువగా ఉందని, భారతదేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశం జపాన్ తో అనుబందం చెసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హెల్త్ టూరిజం హబ్ గా తెలంగాణ మరిందని చెప్పారు. భారతదేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్ లో 35% హైదరాబాద్ నుంచే ఉత్పతి అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.భారత దేశం వెనుకబదడిన దేశం అన్న అభిప్రాయం నుంచి బయటకి తీస్కురావాలి. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెషన్ కు జపాన్ దేశంలో మంచి డిమాండ్ ఉంది. అందుకే మన వాళ్ళకు జపనీస్ ల్యాంగ్వేజ్ నేర్పించాలని నిర్ణయించాం. ప్రపంచాలోనే అనేక విషయాల్లో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర మనకున్నది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగలల్లో ముందంజలో ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాంతి భద్రతలు,డ్రగ్స్ నియంత్రణలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల దుబాయ్ జరిగిన డ్రగ్స్ నియంత్రణ పోటీల్లో హైదరాబాద్ పొలిసులు మొదటి స్థానంలో నిలిచి అవార్డు అందుకున్నారని గుర్తు చేశారు.